
డిసెంబర్ నాటికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..
● రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్
● రైల్వే మోడల్ రన్నింగ్ రూం ప్రారంభం
కాజీపేట రూరల్ : కాజీపేట మండలం అయోధ్యపురం–మడికొండ శివారులో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. శనివారం ప్రత్యేక రైల్లో కాజీపేటకు చేరుకున్న జీఎంకు స్టేషన్ మేనేజర్ రవీందర్ పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం కాజీ పేట జంక్షన్లో రూ.7.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే లోకో పైలెట్లు, ట్రైయిన్ మేనేజర్ల విశ్రాంతి, రైల్వే రన్నింగ్ రూంను జీఎం పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం జీఎం అరుణ్కుమార్ జైన్ విలేకరులతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిసెంబర్ నాటికి పూర్తి కానుందని, అదేవిధంగా రైల్వే అమృత్ భారత్ పనులు కూడా చివరినాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం కార్యాలయంలో తనిఖీ చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం భర్తీష్ కుమార్ జైన్, పీసీఓఎం కె.పద్మజా, సీనియర్ డీఎం సురేష్ రెడ్డి, సీనియర్ డీసీఎం శిఫాలి, సీని యర్ డీఎస్టీఈ ప్రీతి అగర్వాల్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్, ఇతర శాఖల అధికారులు, కాజీపేట డీజి ల్ షెడ్ సీనియర్ డీఎంఈ వెంకట కుమార్, ఎలక్ట్రిక్ షెడ్ సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి, కాడూ రి సుబ్బారావు, జొన్నలగడ్డ శేషగిరి రావు, గోపాలం శ్రీనివాస్రావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
వరంగల్లో కోచింగ్ లాబీకి నాయకుల వినతి
రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, డీఆర్ఎం భర్తీష్కుమార్ జైన్, పీసీఓఎంలను రైల్వే మజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచీ సెక్రటరీ పి.సాయికుమార్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి వరంగల్లో కోచింగ్ సిస్టం లాబీని ప్రారంభించాలని కోరారు. కాజీపేట జంక్షన్కు పూర్వ వైభవం తీసుకురావాలని వినతి పత్రాలు సమర్పించారు. బ్రాంచీ చైర్మన్ సంగ రమేష్, ట్రెజరర్ డి.రఘు, అసిస్టెంట్ చైర్మన్ ఎ.కుమార్, సభ్యులు పాల్గొన్నారు.