
దోచుకుతిన్న ప్రతీ రూపాయి కక్కిస్తాం
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు దోచుకుతిన్న ప్రతీ రూపాయిని కక్కిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని అరెస్టు చేస్తే ఆందోళనలు చేయడంపై రాజేందర్రెడ్డి మండిపడ్డారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు రూ.వెయ్యి కోట్లకు తగ్గకుండా ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని, మాకు ప్రజాస్వామ్యం, చట్టాలపై గౌరవం, నమ్మకం ఉంది కాబట్టే చట్టపరంగా అవినీతి సొమ్మును ప్రభుత్వం రాబడుతుందని చెప్పారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జై తెలంగాణ నినాదం ఎత్తడం సిగ్గుచేటన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ కొందరు ప్రజల్లో తొందరగా పేరు తెచ్చుకోవాలని, హీరోగా చెలామణి కావడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని క్రషర్ యజమాని మనోజ్రెడ్డిని బెదిరించినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, విజయశ్రీరజాలి, జక్కుల రవీందర్ పాల్గొన్నారు.