
కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రంగారావు కన్నుమూత
● వచన కవిత్వంలో అగ్రగణ్యుడు
మాదిరాజు రంగారావు
కేయూ క్యాంపస్ : ఖమ్మం జిల్లాకు చెందిన కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ మాదిరాజు రంగారావు (90) అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో శనివారం కన్నుమూశారు. ఆయన భార్య కొంతకాలం క్రితం మరణించగా ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో పండితుడు, శాసీ్త్రయ సాహిత్యం, భారతీయ, ఆధునిక కవిత్వం, నవల విమర్శ ససంస్కృత సాహిత్య అధ్యయనాలతో సంబంధం కలిగి ఉన్నారు. పదవి విరమణ తర్వాత కూడా వచన కవిత్వంలో 2024 వరకు ప్రతి ఏడాది ఒక పుస్తకం రచించారు కూడా. మాదిరాజు రంగారావు ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్య రచయితలలో ఒకరు. కేయూ తెలుగు విభాగంలో 1968 నుంచి 1995వరకు, ఉస్మానియా యూనివర్సిటీలో 1964 నుంచి 1968 వరకు తెలుగు సాహిత్యాన్ని బోధించారు. స్వేచ్ఛ కవిత్వంపై 46 పుస్తకాలు, పరిశోధన, సాహిత్య విమర్శలపై 14 పుస్తకాలు రచించారు. సుమారు 30 ఏళ్ల పాటు తెలుగు విభాగంలో ఆచార్యుడిగా పనిచేశారు. రంగారావు ఎప్పుడు తెల్లటి దుస్తుల్లో ఉన్నట్లే ఆయన కవితా సంపుటాలు కూడా తెల్లపురంగు కవర్ పేజీలపై ఎరుపు రంగు శీర్షికలతో ఉండేవి. మాదిరాజు రంగారావు మరణంపై సహృదయ సాహితీ సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహరబాబు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్ చారి, కాళోజీ ఫౌండేషన్ మిత్ర మండలి సభ్యులు, ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి సంతాపం ప్రకటించారు.