
కేయూ ఎన్జీఓ అధ్యక్షుడిగా నవీన్కుమార్
కేయూ క్యాంపస్ : కేయూ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.నవీన్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్, క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఓటింగ్ శుక్రవారం జరుగగా ఓట్ల లెక్కింపు శనివారం యూనివర్సిటీలో నిర్వహించారు. అనంతరం ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ ప్రకటించారు. ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.నవీన్కుమార్, ఉపాధ్యక్షుడిగా మహ్మద్ యూనస్, జనరల్ సెక్రటరీగా వల్లాల తిరుపతి, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్)గా ఎ.సతీష్బాబు, జాయింట్ సెక్రటరీ(రిక్రియేషన్)గా టి.ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ (మహిళా)గా బి.కృష్ణవేణి, ట్రెజరర్గా టి.దామోదర్ విజయం సాధించారు. అలాగే.. క్లాస్ఫోర్త్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గుమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా పి.అంకుష్, జనరల్ సెక్రటరీగా బొక్క మొగిలి, జాయింట్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ మహ్మద్వలీ పాషా, జాయింట్ సెక్రట రీ(మహిళా)గా జి.మల్లికాంబ, జాయింట్ సెక్రటరీ (రిక్రియేషన్)గా ఎన్.ఐలయ్య, ట్రెజరర్గా టి.తిరుమల్ శ్రీనివాస్సింగ్ ఎన్నికయ్యారని రాజేందర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
క్లాస్ఫోర్త్ అసోసియేషన్
అధ్యక్షుడిగా గుమ్మయ్య

కేయూ ఎన్జీఓ అధ్యక్షుడిగా నవీన్కుమార్