
కలెక్టరేట్లో వివిధ శాఖల పరిశీలన
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం సందర్శించారు. రెవెన్యూ, ఇతర విభాగాలను స్వయంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్లోని మహిళా క్యాంటీన్కు వెళ్లి అక్కడ న్యూస్ పేపర్లపై ఆహార పదార్థాలు ఉంచడం చూసి ఇలా.. ఉంచితే వాటి రంగు ఆహారపదార్థాలకు అంటుతుందని, ఆరోగ్యానికి హానికరమన్నారు. క్యాంటీన్లో అన్ని రకాల తినుబండారాలు, స్నాక్స్ నాణ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చులు ఏంటి అనే విషయాల్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, ఏఓ గౌరీ శంకర్, తదితరులు ఉన్నారు.