
ముగిసిన బడిబాట
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 6నుంచి ప్రారంభమైన బడిబాట గురువారం ముగిసింది. చివరిరోజు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలు నిర్వహించారు. నడికూడ పాఠశాలలో క్రీడాపోటీలను జెడ్పీ సీఈఓ విద్యాలత ప్రారంభించారు. దామెర మండలం ఊరుగొండ ఉన్నతపాఠశాలలో క్రీడలను కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఎంఈఓ నెహ్రూ ప్రారంభించారు. బడిబాట ముగిసేనాటికి హనుమకొండ జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 3,228 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారు. అందులో ఒకటోతరగతిలో 1,133 మంది ప్రవేశాలు పొందారని డీఈఓ డి.వాసంతి, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో బడిబాట ద్వారా ఈనెల 18వ తేదీ వరకు 4,108మంది విద్యార్థులు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.