నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

Jun 20 2025 5:18 AM | Updated on Jun 20 2025 5:18 AM

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

వేలేరు: స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ సమగ్రాభి వృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు మండలంలోని పైలట్‌ గ్రామం శాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలతో కొన్ని ఇళ్లకు బిల్లులు రాలేదని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. బిల్లులు వచ్చేలా చూడాలని హౌసింగ్‌ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

సబ్‌స్టేషన్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయండి

పీచర శివారులో రూ.23.76 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ పనులను సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించి ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇక్కడే మరో 220/132 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి త్వరలోనే మంజూరు తీసుకొస్తాన్నారు. ఆగస్టులో 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం, 220/132 కేవీ సబ్‌ స్టేషన్‌కు డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో శంకుస్థాపన చేయిస్తానన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

పీచరలో రూ.50 లక్షల ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై నెల చివరి నాటికి మ ల్లన్న గండి నుంచి కన్నారం వరకు పైప్‌లైన్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపుతానన్నారు. గ్రామంలో త్వరలోనే మరో 25 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్ధార్‌ హెచ్‌.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, విద్యుత్‌ శాఖ డీఈ సంపత్‌రావు, ఏడీఈ రాజేశ్వర్‌ రావు, హౌసింగ్‌ డీఈ సిద్ధార్థ నాయక్‌, ఏఈ సుష్మ, కుమారస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌, నాయకులు బిల్లా యాదగిరి, మల్లికార్జున్‌, సద్దాం హుస్సేన్‌, రాంగోపాల్‌రెడ్డి, సమ్మయ్య, రాజిరెడ్డి, రవీందర్‌, సంపత్‌, రాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

అభివృద్ధి పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement