తులసి జ్యోతికి అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

తులసి జ్యోతికి అరుదైన గౌరవం

Jun 27 2026 1:37 AM | Updated on Jun 27 2026 1:37 AM

తులసి జ్యోతికి అరుదైన గౌరవం దుర్గి: ఏపీ మోడల్‌ స్కూల్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డి.తులసిజ్యోతికి అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ అమెరికా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య శాఖలోను, సమగ్ర శిక్ష, పీఎంశ్రీ, మోడల్‌ స్కూళ్లకు జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అందించిన ఉత్తమ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్‌ లభించినట్లు తులసిజ్యోతి పేర్కొన్నారు. గౌరవ డాక్టరేట్‌ రావటంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. గుండెపోటుతో మున్సిపల్‌ ఇంజినీరు మృతి నరసరావుపేట: మున్సిపల్‌ ఇంజినీరు(ఎంఈ) జి.రవికుమార్‌ గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. పట్టణంలోని ప్రకాష్‌నగర్‌ ఆర్‌టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ఆయనకు గురువారం సాయంత్రమే గుండెపోటురాగా చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యశాలలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఏడేళ్లపాటు పబ్లిక్‌హెల్తె డిపార్టుమెంట్‌లో డెప్యూటీ ఇంజినీరుగా పనిచేస్తూ ఎంఈగా పదోన్నతిపై పురపాలక ఇంజినీరుగా బాధ్యతలు చేపట్టారు. పురపాలకసంఘ మున్సిపల్‌ కమిషనర్‌ జస్వంతరావు బదిలీ కావటంతో మూడు నెలలపాటు ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన మృతి వార్త తెలియగానే ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, పబ్లిక్‌హెల్త్‌ కమిషనరు దాసరి శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన, డీఈ మహమద్‌ రఫీక్‌, ఏఈలు, పలువురు మున్సిపల్‌ ఉద్యోగులు, పలువురు పట్టణ ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు మృతదేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి సంతాపం వ్యక్తం చేశారు. సాయంత్రం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్య 29న దుర్గమ్మ సన్నిధిలోగిరి ప్రదక్షిణ

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జక్కంపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో తుపాకుల దుర్గాభవానీ, యేసుబాబు(31) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కాగా, యేసు బాబు ట్రాక్టర్‌ నడుపుకుని జీవనం సాగిస్తుంటాడు. గురువారం ఉదయం పనికి వెళ్లిన యేసుబాబు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో ఆలస్యం ఎందుకయ్యిందని భార్య ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన దుర్గాభవానీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్న యేసుబాబు నిద్రలేచి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో మనస్తాపం చెంది విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో యేసుబాబు బావమరిది దుర్గారావు విషయాన్ని గమనించి వెంటనే 108 ద్వారా కొత్త ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. దుర్గాభవానీ ఆసుపత్రికి చేరుకునే సరికే యేసుబాబు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఘటనపై కొత్తపేట పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు, దేవస్థాన ప్రచార రథంపై మూర్తులతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఘాట్‌రోడ్డు వద్ద ఆలయ అర్చకులు, ఈవోలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్‌, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్‌రావునగర్‌, చిట్టినగర్‌, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్‌, బ్రహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన నున్నారు.

4న ట్రస్ట్‌ బోర్డు సమావేశం...

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు సమావేశం జూలై 4వ తేదీన బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఆషాఢ సారె ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాల నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement