పక్కనే సాగర్ కాలువ అయినా గొంతు ఎండుతున్ననాలుగు గ్రామాలు 6న నరసరావుపేట కలెక్టరేట్ ముట్టడి
నష్టపోయిన పసుపు రైతులకుపరిహారం వెంటనే చెల్లించాలి
లక్ష్మీపురం: దుగ్గిరాల శుభం పసుపు కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం వలన నష్టపోయిన బాధిత పసుపు రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం క్వింటాకు రూ.7 వేలు చొప్పున నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 296 మంది రైతులకు చెందిన(404 బాండ్లు) పసుపు కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదానికి గురైందన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.7 వేల చొప్పున పరిహారం ఇప్పిస్తామని రైతులతో ఒప్పందం చేసుకుంది. రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంత వరకు సింగిల్ పైసా నష్టపోయిన బాధిత రైతులకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి క్వింటాకు రూ.5 వేలు మాత్రమే ఇస్తామని కూటమి నేతలు చెప్పటం చాలా దారుణం అన్నారు. ఒప్పందం చేసుకున్న మేరకు క్వింటాకు రూ.7 వేలు చొప్పున తక్షణమే చెల్లించాలని, రైతులను మోసగించి నష్టపరిచిన శుభం మహశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యానికి పసుపు మార్కెట్లో ఉన్న లైసెన్స్ రద్దు చేయాలని, దాంతో పాటు రాష్ట్రంలోఎక్కడా వ్యాపారం చేయకుండా శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య


