న్యూస్రీల్
జాగ్రత్తలు తీసుకోవాలి
25 కిలోల బరువున్న పిల్లవాడు గరిష్ఠంగా 2.5 కిలోల వరకు మాత్రమే బ్యాగ్ మోయడం మంచిది. అంతకంటే ఎక్కువ రోజూ మోస్తే వెన్ను, మెడ, భుజాల నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు పట్టీలను సమానంగా బిగించి బ్యాగ్ను వీపునకు దగ్గరగా ఉంచాలి. ఒకే భుజంపై బ్యాగ్ వేసుకోవడం మంచిది కాదు. బరువైన పుస్తకాలను బ్యాగ్లో వీపునకు దగ్గరగా అమర్చాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు రోజూ బ్యాగ్లో పెట్టకూడదు. పాఠశాలల్లో లాకర్ లేదా తరగతి గదిలో పుస్తకాలు ఉంచేందుకు ప్రయత్నించాలి. పిల్లలు రోజూ కనీసం గంటసేపు ఆరుబయట ఆటలు, శారీరక వ్యాయామం చేయాలి. ఇది వెన్నెముక కండరాలను బలంగా ఉంచుతుంది. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ను వంగి చూడకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు తరచుగా వెన్ను, మెడ, భుజాల నొప్పి వంటి వాటి గురించి చెబితే నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
వెన్నునొప్పి లక్షణాలు ఇవే....
సాగర్ నీటిమట్టం
చిన్నారులు వెన్నునొప్పితో బాధపడే సమయంలో నడకలో తేడా కనిపిస్తుంది. నిలబడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు. నడుం లేదా మెడనొప్పి అని చెబుతుంటారు. వెన్నెముక భాగం స్పష్టంగా వంకరగా కనిపిస్తుంది. వెనుక భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిపాటి లేదా విపరీతమైన నొప్పి వెన్ను భాగంలో వస్తుంది. రాత్రివేళల్లో నొప్పి వల్ల పిల్లలు సరిగా నిద్రపోరు. జ్వరంగా ఉంటుంది. ఆటలు ఆడేందుకు సైతం ఇబ్బంది పడతారు.
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026
ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తకాల మోతతో భారంగా మారుతోంది. ఇప్పటికే ఆటలకు దూరమైన చిన్నారులు పాఠశాల గదుల్లోనే ఎక్కువగా మగ్గిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రైవేటు స్కూళ్లపై మోజు పెరిగిపోయింది. దీంతో బుడిబుడి అడుగులు వేసే బుడతలకు బండెడు పుస్తకాలు వీపున వేస్తున్నారు. ఇదే వారి వెన్నెముకకు భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– డాక్టర్ జె. నరేష్బాబు,
సీనియర్ స్పయిన్ సర్జన్, గుంటూరు
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 515.30 అడుగులకు చేరింది. ఇది 140.4451 టీఎంసీలకు సమానం.


