14న నాట్కో సెంటర్‌లో పెట్‌ స్కాన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

14న నాట్కో సెంటర్‌లో పెట్‌ స్కాన్‌ ప్రారంభం

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

గుంటూరు మెడికల్‌: క్యాన్సర్‌ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌ లోని నాట్కో సెంటర్‌ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్‌ విభాగంలో ఈ నెల 14న పెట్‌ స్కాన్‌ సెంటర్‌ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement