
ఆగ్ర హం
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్, సోషల్మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్కుమార్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు దానం వినోద్, క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల విజయ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ మాట్లాడారు. అనంతరం నిరసన సభ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా పార్టీ, యువజన, విద్యార్ధి విభాగం నేతలు ముందుకు సాగారు. కలెక్టర్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని, సహకరించాలని కోరడంతో పది మంది ముఖ్యనేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. తొలుత తూర్పు నియోజకవర్గ నుంచి పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ద్విచక్ర వాహనాలు ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, శేషగిరి పవన్, మేరి కుమారి, జగదీష్, పేటేజీ బాజీ, యువజన విభాగం నేతలు మహ్మద్ గౌస్, పులగం సందీప్రెడ్డి, కోటిరెడ్డి, చుండు వెంకటరెడ్డి, గౌతమ్, సాంబశివరావు, కొండమడుగుల గోపిరెడ్డి, ఈదా యశ్వంత్రెడ్డి, సూరజ్, వంగా సీతారామిరెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర, జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు.
పోలీసు జులుంపై