
మనోడిదే.. వదిలేయండి !
తెనాలి: ‘మనోడే పాడుకుంటాడు...మీరు వదిలేయండి!’ దేవదాయ శాఖ పరిధిలోని పట్టణ బోసురోడ్డులోని శ్రీకాకుమాను శంకరుని ధర్మ సత్రానికి చెందిన పాత సత్యనారాయణ టాకీస్ వేలం పాటలో పాల్గొన్న వ్యక్తులకు తెలుగు తమ్ముళ్ల నుంచి వచ్చిన ఫోను ఇది. అప్పటివరకు వచ్చిన పోటీకి మరికొంత పలికించి మనోడికి పాట వచ్చేలా చూశారు. అంతవరకూ బాగానే ఉందనుకున్నా, నిబంధనల ప్రకారం వేలంపాటలో పాల్గొనే ముందు సదరు పాటదారుడు ఇతరుల్లా డిపాజిట్ డబ్బులు చెల్లించలేదు. తన పేరిట పాట కొట్టేశాక, తొలి ఆరు నెలల అద్దె డబ్బులు కూడా చెల్లించలేదు.
తెలుగు తమ్ముళ్ల నుంచి ఫోన్లు
పట్టణంలోని శ్రీకాకుమాను శంకరుని ధర్మసత్రం స్థలంలో శ్రీ సత్యనారాయణ టాకీస్ సుదీర్ఘకాలం నడిచింది. అది మూతపడ్డాక యథా ప్రకారం దేవదాయ శాఖ వేలం నిర్వహిస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా అక్కడ ఫంక్షన్ హాలు నడుస్తోంది. కాలపరిమితి పూర్వవడంతో మూడు రోజుల క్రితం వేలం నిర్వహించారు. అయిదారుగురు హాజరయ్యారు. ప్రస్తుతం నెలకు రూ.95 వేల వరకు అద్దెతో ఉన్న ఆ ఫంక్షన్ హాలు వేలం పాట రూ.1.28 లక్షల వరకు వెళ్లింది. అంతలోనే పాటదారులకు తెలుగు తమ్ముళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ‘‘మనోడు పాడుకుంటాడు...మీరు వదిలేయండి’’ అన్నారు. దీనితో మిగిలినవారు వదిలేశారు. ధర్మసత్రం ఈవో వేలంపాటను ‘మనోడి’ పేరిట కొట్టేశారు. ఫోన్లు రాకపోయినట్టయితే రూ.1.60 లక్షల వరకు పాట వెళ్లేదని ప్రస్తుతం పట్టణంలో చర్చ నడుస్తోంది.
దేవదాయ శాఖ వేలంపాటలో ‘తమ్ముళ్లు’ మనోడికి దక్కేలా చక్రం తిప్పారు డిపాజిట్ లేకుండానే పాటకు అనుమతి ఆరు నెలల అద్దెనూ చెల్లించనిపాటదారుడు పచ్చపాతంతో ఏకపక్షంగా విలువైనఫంక్షన్ హాలు వేలం పాట
డిపాజిట్కు ఎగనామం