భాగ్యనగరంలో థ్రెడార్టే 'మేధ్య' ప్రదర్శన | Medhyaa by threadarte opens in Hyderabad on April 16 | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో థ్రెడార్టే 'మేధ్య' ప్రదర్శన

Apr 16 2026 11:00 AM | Updated on Apr 16 2026 11:17 AM

Medhyaa by threadarte opens in Hyderabad on April 16

థ్రెడార్టే 'మేధ్య' ప్రదర్శన ఏప్రిల్ 16 నుండి 19 వరకు, ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియో సమీపంలోని స్పిరిట్ కనెక్ట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంటుంది.

దారంతో మొదలై ఇత్తడి, ఉక్కు, పునరుపయోగించిన వస్త్రాల వరకు పరిణామం చెందుతూ, కళాకారుల కళాఖండాలు శిల్పానికి, వస్తువుకు మధ్య ఉంటూ, హస్తకళ, రూపకల్పన, వస్తుపరమైన జ్ఞాపకాలను మేళవిస్తాయి. ముఖ్యమైన కళాఖండాలలో, పరివర్తన చెందుతున్న నది నుంచి ప్రేరణ పొందిన 'అధిధార్', పరిమాణం, సహజ శక్తిని అన్వేషించే 'అనంత్',  ప్రాదేశిక అనుభవాన్ని పునర్నిర్మించే వేలాడే ఇన్‌స్టాలేషన్ అయిన 'రీచింగ్ బియాండ్' ఉన్నాయి.

ఈ ప్రదర్శనలో, రోజువారీ ప్రదేశాల కోసం రూపొందించిన, చేతితో శుద్ధి చేసిన ఇత్తడి, ఉక్కు వస్తువుల శ్రేణి అయిన 'ప్రయాన్' కూడా ఉంది. ఆర్ట్ కనెక్ట్‌ను మిహీకా దగ్గుబాటి స్థాపించారు. స్థలం,అనుభవం పట్ల ఆమెకున్న సహజ ప్రవృత్తి, ఈ ప్లాట్‌ఫారమ్ చేసే ప్రతి పనికి రూపాన్ని ఇస్తుంది. ఆమె తన డిజైన్ స్టూడియో బోహీమ్ ముదిత ట్రైబ్‌తో కలిసి పనిచేస్తే.. మన భావోద్వేగం భౌతిక పరిసరాలతో ఎలా అనుసంధానం అయ్యేలా ప్రభావితం చేస్తుందో తెలుస్తుందని అంటారామె.

(చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!)
 

Advertisement
 
Advertisement
Advertisement