ఆగి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

ఆగి ఉన్న లారీని ఢీకొని  పురోహితుడు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి

కై కలూరు, ఆకివీడు: రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి చెందిన ఘటన ఆలపాడు కో–ఆపరేటీవ్‌ సమీపంలో గురువారం జరిగింది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన గొర్తి శ్రీనివాసరావు(53) పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్య, ఇరువురు కుమార్తెలు సంతానం. కై కలూరు మండలం గోపవరంలో ఓ గృహప్రవేశ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి ఆకివీడు వెళుతుండగా ప్రమాదం జరిగింది. భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరావు మరణించాడు. భార్య దుర్గా విజయలక్ష్మి ఫిర్యాదుపై రూరల్‌ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు. ఆయన మృతి పట్ల బ్రాహ్మణ సంఘం, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement