
కొల్లేరు సమస్యలపై మొర
పిడుగులు.. తస్మాత్ జాగ్రత్త
వర్షాకాలం పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. తగు జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు ప్రమాదాన్ని నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 10లో u
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరుపై కేంద్రం నియమించిన సాధికారత కమిటీ బుధవారం కొల్లేరు వాసులు, నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొల్లేరు ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, మత్స్యకారులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు బుధవారం తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. కేంద్ర సాధికారత కమిటీ గౌరవ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్, సభ్య కార్యదర్శులు జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్లకు విన్నవించుకున్నారు.
జి రాయితీ, డీ–ఫాం భూములు మినహాయించాలి
పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానికులకు జీవనోపాధితో పాటు భూములపై హక్కులు ఉండేలా చూడాలని వినతి పత్రాలు అందజేశారు. అభయారణ్యంలోని జిరాయితీ డీ–ఫామ్ భూములు మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు మాట్లాడుతూ.. కొల్లేరులో పర్యావరణ, పక్షులను కాపాడేది రైతులేనని, కొల్లేరు అభయారణ్యం నోటిఫికేషన్ విడుదల చట్టంగా రూపొందించే సమయంలో పరిణామాలపై ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి అవగాహన కలిగించలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కొల్లేరు ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్లలో చెత్తను తొలగించని కారణంగా, సరైన నిర్వహణ పనులు చేపట్టక ఏటా వరదల సమయంలో కొల్లేరు ప్రాంతం ముంపునకు గురవుతుందన్నారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ప్రజల పౌర హక్కులకు, జీవన విధానాలకు ఎలాంటి భంగం కలగకుండా మానవీయ కోణంతో చూడాలన్నారు. శివాజీ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయని, అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలున్నారన్నారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేదన్నారు. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి స్పందించారని, దీనినిబట్టి కొల్లేరు చట్టంపై ఏ విధమైన అవగాహన కలిగించారన్నది స్పష్టం అవుతుందన్నారు.
కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి
కై కలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీని కోరారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలోని 14 వేల ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20 వేల ఎకరాల డీ–ఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలన్నారు. కాంటూర్ పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది అమలు జరగలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీ ప్రిన్సిపాల్ చీఫ్ కన్ఝర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, మత్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, డీఎఫ్ఓలు శుభం, విజయ తదితరులు పాల్గొన్నారు.
అదుపు తప్పిన కారు
ద్వారకా తిరుమల వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి, టైల్స్ షాపును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. 10లో u
అధికారులతో సమీక్ష
కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ఉప్పుటేరులోకి కలిసే ఇరిగేషన్ డ్రెయిన్లు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలు, డ్రెయిన్ల డీసిల్టింగ్పై నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ నాగార్జునరావును ఆదేశించారు. కొల్లేరు వన్యప్రాణి అభ్యయారణ్యంగా ప్రకటించక ముందు కొల్లేరు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, గ్రామాలను కలిపే లింక్ రోడ్లు, ప్రస్తుతం వాటి నిర్వహణ, కొత్తగా నిర్మించిన, నిర్మించే రోడ్లపై, కొల్లేరు అభయారణ్య పరిధిలో రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణలపై ఉన్న సమస్యలపై నివేదిక అందించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ రమణమూర్తిని కమిటీ సభ్యులు ఆదేశించారు. అనంతరం ఏలూరులో పారిశుద్ధ్య వ్యర్థాలు, వ్యర్థాల శుద్ధీకరణ సామర్థ్యం, కొల్లేరులో కలిసే ఏలూరు నగరంలోని పారిశుద్ధ్య వ్యర్థాలు వివరాలపై నివేదిక సమర్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. కొల్లేరు పరిధిలో పర్యావరణం, కాలుష్య పరిస్థితులు, చేపల పెంపకానికి వినియోగించే నీరు, తాగునీటి కాలుష్యం, పరిశ్రమల ద్వారా కొల్లేరులోకి వెళ్లే వ్యర్థాల కారణంగా కాలుష్యం తదితర వివరాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కొల్లేరులో చేపల పెంపకం, కాలుష్య నీటిలో ఉత్పత్తియ్యే చేపల వినియోగం కారణంగా అనారోగ్య సమస్యలు, చేపల పెంపకానికి వినియోగించే రసాయనిక ఎరువులు, పురుగుమందుల వివరాలు, వాటి కారణంగా కొల్లేరులో కలిగే కాలుష్యం తదితర విషయాలపై నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ అధికారులను సూచించారు.
న్యూస్రీల్
సీఈసీ బృందానికి వినతుల వెల్లువ
ఏలూరు కలెక్టరేట్కు పెద్ద ఎత్తున కొల్లేరు వాసులు
భూములపై హక్కులుండేలా చూడాలని విజ్ఞప్తి

కొల్లేరు సమస్యలపై మొర

కొల్లేరు సమస్యలపై మొర

కొల్లేరు సమస్యలపై మొర