
విత్తన ఎంపికే కీలకం
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సార్వా వరి సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం, గత దాళ్వా సీజన్ ధాన్యం సొమ్ములు ఇంకా చెల్లించపోవడంతో వరిసాగుకు రైతులు మీనవేషాలు లెక్కించాల్సిన పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 24 గంటల లోపు సొమ్ములు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకున్న ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు రూ.290 కోట్లు బకాయిపడినా నోరుమెదపపోవడం పట్ల రైతన్నలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకున్నా, సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించపోయినా వరిసాగు తప్పనిసరికావడంతో సార్వా సాగుకు విత్తనాల సేకరణ, భూములు దుక్కులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. సార్వా పంటకు అనువైన విత్తనాలు వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నందున విత్తన ఎంపిక కీలకం..
సార్వా వరి సాగు ప్రారంభం
ఉమ్మడి పశ్చిమగోదావరిలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు
చీడ పీడలు తట్టుకునే రకాలు ఎంచుకోవాలి
వరిసాగులో రైతులు విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం, భూసార పరిస్థితులకు అనువైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. చీడ, పీడలను తట్టుకునే వరిరకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకోవచ్చు.
– ఎంవీ కృష్ణాజీ, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనాస్థానం, మార్టేరు

విత్తన ఎంపికే కీలకం