
తల్లికి వందనం వర్తింపజేయాలి
వీరవాసరం: తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపజేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వీరవాసరం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ.. రూ.10,000 వేతనం దాటిందని, గవర్నమెంట్ ఉద్యోగి అని అంగన్వాడీలకు పథకాన్ని తిరస్కరించడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అంగన్వాడీలకు వర్తించిందని అన్నారు. అత్యధికమంది కేవలం వేతనం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. స్కీం వర్కర్లుగా, గౌరవ వేతనంతో బతికే అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఇంతవరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి అంగన్వాడీలు రోడ్డు మీదకు రావడం తప్పదని అన్నారు.