
గుండుగొలను వంతెన పనుల్లో కదలిక
భీమడోలు: గోదావరి కాల్వపై గుండుగొలను వద్ద చేపట్టిన వంతెన నిర్మాణ పనుల్లో బుధవారం కదలిక వచ్చింది. వంతెన శ్లాబ్ పనులు పూర్తి కాగా.. నిధులు లేమితో చివరి దశ పనులు నిలిచిపోయాయి. దీంతో కొల్లేరు వాసుల ‘కలల వారధి ఇంకెన్నాళ్లు?’ అనే శీర్షికన ఈనెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, గ్రామ పెద్ద గొర్రెల పవన్ల ఆధ్వర్యంలో వంతెన ఆఖరి పనుల చేపట్టేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చవుతున్నందున, ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. దీంతో వారంతా సుముఖత వ్యక్తం చేయడంతో పనులు పునః ప్రారంభించారు. వంతెనకు ఇరువైపులా జేసీబీ సాయంతో ఎర్ర కంకర వేసి పటిష్టం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యిన తర్వాత భారీ వాహనాల మినహా ఇతర వాహనాలను వంతెనపై రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

గుండుగొలను వంతెన పనుల్లో కదలిక