
ద్వారకాతిరుమలలో అదుపు తప్పిన కారు
ద్వారకాతిరుమల : శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి నలుగురు యువకులతో వెళుతున్న కారు అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం దాటిన తరువాత మలుపులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమవరంనకు చెందిన కె.విష్ణు తన అన్న కారును తీసుకుని, అదే పట్టణానికి చెందిన తన స్నేహితుడు మనోజ్తో కలసి ద్వారకాతిరుమల క్షేత్రానికి ధైవదర్శనార్థం పయనమయ్యాడు. మార్గ మద్యలో గణపవరం మండలం పిప్పరలో మరో ఇద్దరు స్నేహితులు బండారపు మోహన వెంకట సాయి, వడ్డీల ప్రభాకర్ను కారులో ఎక్కించుకున్నాడు. అతి వేగంగా వెళుతున్న కారు ఘటనా స్థలం వద్ద మలుపులోకి వచ్చేసరికి అదుపుతప్పి, రోడ్డు మార్జిన్లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు, మోహన్ వెంకట సాయి, ప్రభాకర్లకు తీవ్ర గాయాలు కాగా మనోజ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రులను 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు.
ముగ్గురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు

ద్వారకాతిరుమలలో అదుపు తప్పిన కారు