కలల వారధి ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

కలల వారధి ఇంకెన్నాళ్లు?

Jun 16 2025 5:45 AM | Updated on Jun 16 2025 5:45 AM

కలల వ

కలల వారధి ఇంకెన్నాళ్లు?

భీమడోలు: గోదావరి కాల్వపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియక నియోజకవర్గ వాసులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడిచింది. వైఎస్సార్‌సీపీ హయాంలో పనులు పరుగు పెట్టగా.. కూటమి పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల వంతెన శ్లాబ్‌ వేసినా నేటికి మిగిలిన పనులు జరగకపోవడంతో ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండున్నరేళ్ల క్రితం జాతీయ రహదారికి అనుసంధానంగా గుండుగొలను వద్ద గోదావరి కాల్వపై నిర్మించిన బ్రిటిష్‌ కాలం నాటి వంతెన కూలిపోయింది. దీంతో భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్‌, కై కలూరు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సీఎం హోదాలో గణపవరం వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన జగనన్న గుండుగొలను, నారాయణపురం వద్ద కొత్త వంతెనల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. శాశ్వత వంతెన నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 కోట్లు మంజూరు చేశారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నయంగా గుండుగొలను వద్ద కాల్వపై బెయిలీ బ్రిడ్డిని నిర్మించేందుకు రూ.40 లక్షలు మంజూరు చేయించారు. వంతెన నిర్మాణం నేపథ్యంలో కేంద్ర జలరవాణాశాఖ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా, వంతెన నిర్మాణంలో తన వంతు కృషి చేశారు. దీంతో 60శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సౖరైన విధానాలను పాటించకపోవడం, వారి మధ్య సమన్వయం కరువవడంతో నిర్మాణం చిక్కుముడిలా మారింది.

జల రవాణ శాఖ అభ్యంతరం

11 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాల్సి ఉన్నా 5 మీటర్ల ఎత్తు ఉండడంతో కేంద్ర జల రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కాల్వలో జల రవాణ జరిగే అవకాశం ఉందని, స్టీమర్లు, పడవలు, ఓడల రవాణాకు ఈ వంతెన అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. తక్షణం నిలిపివేయాలని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నారు. సమస్య కొలిక్కి రాకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది.

బెయిలీ వంతెనపై భయం భయంగా

గుండుగొలను వద్ద శాశ్వత వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఆ వంతెన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు గోదావరి కాల్వపై బెయిలీ వంతెనను నిర్మించి ప్రజల రాకపోకల కష్టాలకు చెక్‌ పెట్టారు. ఈ వంతెన వ్యవధి రెండేళ్లని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రారంభోత్సవం సమయంలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌కు గడువు ముగుస్తుంది. ఈ వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో వంతెన ప్రమాదంగా మారింది.

గుండుగొలను వంతెన పనుల్లో జాప్యంపై అసంతృప్తి

కూటమి పాలనలో ముందుకు సాగని నిర్మాణం

వంతెన తక్షణం నిర్మించాలి

గుండుగొలను వంతెన నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడుస్తుంది. నేటికీ పూర్తి కాలేదు. నిర్మాణానికి రూ.3 కోట్లు, బెయిలీ వంతెన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేయించాం. దీంతో పనులు సాగుతున్నాయి. కూటమి పాలనలో వంతెన నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకు రావాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. పాలకులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడంతో ఈ వంతెన నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి. దీంతో కొల్లేరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన వంతెన అవాంతరాల మధ్య జరుగుతుంది. నారాయణపురం వంతెన కూలిపోతుంది. అప్పట్లో నారాయణపురం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు పట్టించుకుంటే ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేది. పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు

కలల వారధి ఇంకెన్నాళ్లు? 1
1/2

కలల వారధి ఇంకెన్నాళ్లు?

కలల వారధి ఇంకెన్నాళ్లు? 2
2/2

కలల వారధి ఇంకెన్నాళ్లు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement