నూజివీడు: నూజివీడులోని వీటీహెచ్ గ్రౌండ్లో ఈనెల 20న ఉదయం 7 నుంచి బాస్కెట్బాల్ ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్జూనియర్, జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ సుభాష్ చంద్రబోస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని, ఆధార్ కార్డు, పాస్పోర్టు, స్టాంపు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు.
సబ్జూనియర్ విభాగంలో పాల్గొనేందుకు 2012 జనవరి ఒకటి, జూనియర్ విభాగంలో పాల్గొనేందుకు 2008 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపిక చేసిన జట్లు మే 15 నుంచి 18 వరకు చిత్తూరులో నిర్వహించే 8వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ నందు, అలాగే జూన్లో నిర్వహించే 10వ ఏపీ స్టేట్ జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.