రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Jun 20 2025 5:51 AM | Updated on Jun 20 2025 5:51 AM

రేపటి

రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: పాలిటెక్నిక్‌ కోర్సులలో ప్రవేశాలకు శనివారం నుంచి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభించనున్నట్లు బొమ్మూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, కాప్‌, దివ్యాంగ అభ్యర్థులు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకూ జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారు శుక్రవారం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించాలన్నారు. సీట్ల కేటాయింపు జూలై 7న పూర్తవుతుందన్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకూ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. జూలై 1న ఆప్షన్లు తిరిగి మార్చుకోవచ్చన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌, ర్యాంకు కార్డు, 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్లు, 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ ఒరిజినల్‌ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌లు కూడా సమర్పించాలని నాగేశ్వరరావు సూచించారు.

ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌ తేదీలు

తేదీ ఏ ర్యాంకు నుంచి ఏ ర్యాంకు వరకూ

21 1 15,000

22 15,001 32,000

23 32,001 50,000

24 50,001 68,000

25 68,001 86,000

26 86,001 1,04,000

27 1,04,001 1,20,000

28 1,20,001 చివరి ర్యాంకు వరకూ

రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌1
1/1

రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement