
వచ్చే నెల 5న లోక్ అదాలత్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 5న జాతీ య లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా న్యా య సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పలు అంశాలపై చర్చించారు. సునీత మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులను అధిక సంఖ్యలో లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. అదనపు జిల్లా న్యాయస్థానాల్లో మోటారు వాహన ప్రమాదాల కేసులను పరిష్కరించి, బాధితులకు పరిహారం అందించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. వీటితో పాటు భూ, ఆస్తి వివాదాలు, రెవెన్యూ, మునిసిపాలిటీ కేసులు, రాజీ పడదగిన అన్ని ఇతర కేసులనూ పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.