
ఆ 3 కిలోమీటర్ల నిర్మాణానికి అడ్డంకులు
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మన రాష్ట్రంలో రెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనులు పొంగుటూరు వద్ద 3 కిలోమీటర్ల మేర భూసేకరణ సమస్యతో నిలిచిపోయాయి. దీనిపై తీర్పును 2024 ఫిబ్రవరిలో న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ వారంలో తీర్చు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఈ మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సుమారు 8 నెలలు పడుతుంది.
– సురేంద్రనాథ్, ప్రాజెక్టు డైరెక్టర్, భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ, రాజమహేంద్రవరం