
అవకాశాలు ఓపెన్
అర్హతలు ఇవే..
ఫ ఎస్సెస్సీ కోర్సులో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.
ఫ గరిష్ట వయోపరిమితి ఉండదు.
ఫ దరఖాస్తుతో పాటు టీసీ, రికార్డు షీటు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఇంటర్కు 10వ తరగతి మార్కుల జాబితా, ఎస్సెస్సీ టీసీని దరఖాస్తుతో పాటు అందజేయాలి.
ఫ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
రాయవరం: రోజు వారీ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా సార్వత్రిక పాఠశాల ద్వారా పది, ఇంటర్ ఇంటర్ చదివే అవకాశాన్ని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం కల్పిస్తోంది. రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్లో కొన్ని సబ్జెక్టులు పూర్తి చేయలేక పోయిన వారు ఉత్తీర్ణత పొందిన వాటిలోంచి గరిష్ఠంగా రెండు సబ్జెక్టుల మార్కులను బదలాయించుకుని మూడు సబ్జెక్టులతో మాత్రమే పరీక్షలు రాసే విధంగా రూపొందించిన ఈ కోర్సులకు ప్రవేశ ప్రకటన వెలువడింది. జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో నిర్వహించే సార్వత్రిక విద్య ప్రవేశాలకు దరఖాస్తులు ఈ నెల 12 నుంచి ఆహ్వానిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 256 కేంద్రాలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అక్రియేటెడ్ ఇనిస్టిట్యూషన్స్(ఏఐ) 256 కేంద్రాలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 81, కాకినాడ 98, తూర్పు గోదావరిలో 77 ఏఐ సెంటర్లు ఉన్నాయి. ప్రవేశాలు పొందగోరే వారు అధ్యయన కేంద్రం వద్ద దరఖాస్తు ఏఐ కోర్డినేటర్ వద్ద ఆన్లైన్ చేయించుకుని, ఏపీ ఆన్లైన్ సెంటర్లో ఫీజు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం 1991లో ఏపీ ఓపెన్ స్కూల్ విధానాన్ని ప్రవేశ పెట్టింది.
ప్రవేశాలు ఇలా..
ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అపరాధ రుసుం లేకుండా జూలై 31వ తేదీ లోగా ఆన్లైన్ అడ్మిషన్ పొందవచ్చు. రూ.200ల అపరాధ రుసుంతో ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు అడ్మిషన్ పొందవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ పురుషులకు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు కలిపి రూ.1,550, అన్ని వర్గాల సీ్త్రలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పీహెచ్సీ పురుషులకు రిజిస్ట్రేషన్+అడ్మిషన్ ఫీజుతో రూ.1,150 చెల్లించాలి. ఇంటర్లో జనరల్ పురుషులకు రూ.1,800, అన్ని వర్గాల మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మైనార్టీ వారికి రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అపరాధ రుసుం ఎస్సీస్సీ, ఇంటర్కు రూ. 200 చొప్పున ఫీజుకు అదనంగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులకు అదనంగా మీసేవా చార్జీలు రూ.36 చెల్లించాలి.
కనీసం 24 కాంటాక్టు తరగతులు
అడ్మిషన్ పొందిన వారికి ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం అధ్యయన కేంద్రాల్లో 30 కాంటాక్టు తరగతులు నిర్వహిస్తారు. కనీసం 24 తరగతులకు హాజరైన వారిని మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.
10లో ప్రవేశం పొందాలనుకునే వారు గ్రూపు–ఎలో ఇంగ్లిషుతో పాటుగా తెలుగు/హిందీ/తమిళం/ఒరియా తీసుకోవచ్చు. గ్రూపు–బి లోని గణితం, సైన్స్, సోషల్ తీసుకోవాలి. ఇంటర్లో గ్రూపు–ఎలో ఇంగ్లిషుతో పాటుగా తెలుగు/హిందీ/తమిళం/ఒరియా తీసుకోవచ్చు. గ్రూపు–బి ప్రధాన సబ్జెక్టుల నుంచి మూడు సబ్జెక్టులతో కలిపి ఐదు సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. సార్వత్రిక పాఠశాలలో చేరే వారికి స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తారు.
ఐదేళ్లలో పూర్తి చేయాలి
అభ్యాసకులు నిర్ణీత ఐదేళ్లలో తొమ్మిదిసార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణులవ్వాలి. అలా ఉత్తీర్ణత పొందక పోతే తిరిగి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. 10 పాసై రెండేళ్ల వ్యవధి ఉంటే ఇంటర్లో ఐదు సబ్జెక్టులు ఒకేసారి రాసుకోవచ్చు.
మార్కుల బదలాయింపు
రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫెయిలైనప్పటి నుంచి ఐదేళ్ల లోపు సార్వత్రిక పాఠశాలలో చేరితే రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్లో పాసైన సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టుల మార్కులను బదలాయించుకునే వీలుంది. పదిలో హిందీ మార్కులను మాత్రం బదలాయించరు. ఇలా బదలాయించుకున్న వారు మిగిలిన మూడు సబ్జెక్టుల పరీక్షలు రాస్తే సరిపోతుంది. మార్కులు బదలాయించుకునే వారు ఎస్సెస్సీలో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్కు రూ.150ల చొప్పున అదనంగా చెల్లించాలి.
ఇంటి దగ్గరే పది,
ఇంటర్ చదివే అవకాశం
ప్రారంభమైన
అడ్మిషన్ల ప్రక్రియ
జూలై 31 తుది గడువు
ఏటా ప్రవేశాలు పెరుగుతున్నాయి
అర్హతలు, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించే 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాల సంఖ్య ఏటా పెరుగుతుంది.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, అమలాపురం

అవకాశాలు ఓపెన్

అవకాశాలు ఓపెన్