
108 అంబులెన్స్కు సుస్తీ..
ప్రత్తిపాడు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రికగా పేరొందిన 108కి సుస్తీ చేసింది. ఫోన్ చేయగానే కుయ్.. కుయ్ మంటూ వచ్చే 108 వాహనానికి అవస్థలు వచ్చిపడ్డాయి. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని 108 వాహనం సాంకేతిక లోపంతో తరచూ స్టార్ట్ కానంటూ మొండికేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి మరమ్మతుల కోసం ఎదురుచూస్తూనే ఉంది. సిబ్బంది చిన్న మరమ్మతులు చేయడం, బండి బయలుదేరడం అన్నట్టు సాగిపోతోంది. 108కు ఎవరైనా కాల్ చేస్తే.. ఆగమేఘాలపై వెళ్లాల్సిన అపర సంజీవనికి ‘స్టారింగ్’ కష్టాలు లొచ్చాయి. ఎవరైనా బండిని నెట్టుతారా అంటూ ఎదురుచూడడం నిత్యకృత్యమైంది. ఎప్పటిలాగే గురువారం బండి స్టార్ట్ కాకపోవడంతో ఇలా.. తలో చేయి వేస్తున్నారు.