దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు

Woman Killed Her Aunty With Roti Stick At Guntur District - Sakshi

సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన అత్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని తెనాలిలో నివాసం ఉంటున్న కోడలు ప్రియాంక తన అత్త తలపై చపాతీ కర్రతో బలంగా కొట్టింది. దీంతో అత్త మైధిలి అక్కడికక్కడే మృతి చెందింది.

చదవం‍డి: Kidnap: నవ వధువును కిడ్నాప్‌ చేసిన టీడీపీ నేత

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అత్త వేధింపులు భరించలేకే కోడలు ప్రియాంక ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని​ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

చదవండి: పహాడీషరీఫ్‌: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top