స్వాభిమాన్‌ జలాశయంలో నాటు పడవ బోల్తా | Odisha: Boat Capsizes In Swabhiman Anchal, Three Missing | Sakshi
Sakshi News home page

ముగ్గురి గల్లంతు.. గాలిస్తున్న సహాయక బృందాలు

May 20 2021 10:05 AM | Updated on May 20 2021 10:09 AM

Odisha: Boat Capsizes In Swabhiman Anchal, Three Missing - Sakshi

జలాశయం వద్ద కుటుంబీకుల ఆందోళన, గాలింపు చర్యలకు సిద్ధమైన బృందం

వేరే గ్రామానికి ప్రయాణికులతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీళ్లల్లో పడ్డారు. ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు.

మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి స్వాభిమాన్‌ ఏరియా జలాశయంలో నాటు పడవ బోల్తాపడి ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సమితిలోని ఓండ్రాపల్లి పంచాయతీ ఓరపొదర్‌ గ్రామానికి చెందిన 8 మంది వ్యక్తులు, అదే పంచాయతీ దామోదర బేడ గ్రామానికి చెందిన గోపాల్‌ ముదులి (45), కుమార్తె జమున ముదులి, మూడేళ్ల మనుమడు కోరుకొండ సమితిలోని నక్కమమ్ముడి పంచాయతీ భకులి గ్రామానికి నాటు పడవలో వస్తున్నారు.

అయితే పడవలో బరువు ఎక్కువ కావడంతో జలాశయం మధ్యలో బోల్తాకొట్టింది. దీంతో గోపాల్‌ ముదులి, జయ ముదులి, మూడేళ్ల బాలుడు గల్లంతయ్యారు. పడవలో ఉన్న మిగిలిన 8 మంది ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన వారి సమాచారం అగ్నిమాక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో వారి ఆచూకీ తెలియరాలేదు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఉండడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement