బిర్యానీ ఆశ చూపి.. డ్రగ్స్‌ ఇచ్చి | Kolkata Man Addicted To Prn Lure 9 Year Old Girl With Biryani And Molested | Sakshi
Sakshi News home page

బిర్యానీ ఆశ చూపి.. డ్రగ్స్‌ ఇచ్చి

Feb 9 2021 7:25 PM | Updated on Feb 9 2021 7:43 PM

Kolkata Man Addicted To Prn Lure 9 Year Old Girl With Biryani And Molested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిన్నారి బతికి ఉంటే తమను గుర్తు పడుతుందనే ఉద్దేశంతో బాలిక గొంతు కోసి

కోల్‌కతా: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం వెలుగు చూసింది. చైల్డ్‌ పోర్నోగ్రఫి‌కి బానిస అయిన ఓ వ్యక్తి, బాడీగార్డుగా పని చేస్తోన్న తన స్నేహితుడితో కలిసి తొమ్మిదేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. బిర్యానీ ఆశ చూపి.. చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. వివరాలు.. కోల్‌కతా జోరాబగన్‌ ప్రాంతానికి చెందిన రణ్‌వీర్‌ తంతి అలియాస్‌ రఘువీర్‌ మార్బుల్‌ కట్టింగ్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. మద్యం, చైల్డ్‌ పోర్నోగ్రఫికి బానిస అయ్యాడు. ఇక నిందితుడికి లాల్‌బజర్‌ ప్రాంతంలో ఉండే బాధితురాలి కుటంబంతో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో దారుణం జరిగిన నాడు రణ్‌వీర్‌, బాడీగార్డ్‌తో కలిసి బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారికి బిర్యానీ ఆశ చూపి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై గ్యాంగ్‌ రేప్‌కు ఒడిగట్టారు. ఇక చిన్నారి బతికి ఉంటే తమను గుర్తు పడుతుందనే ఉద్దేశంతో బాలిక గొంతు కోసి హత్య చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలికకు డ్రగ్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోందని.. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

చదవండి: మైనర్‌పై ఐదు నెలలుగా.. 17 మంది

Advertisement
 
Advertisement
Advertisement