ఖమ్మం: మరీ ఇంత ఘోరమా? | Khammam Man Kills Own Mother And Kids Ran Away | Sakshi
Sakshi News home page

ఖమ్మం: మరీ ఇంత ఘోరమా?

May 18 2024 11:34 AM | Updated on May 18 2024 12:55 PM

Khammam Man Kills Own Mother And Kids Ran Away

కన్న తల్లిని, ఇద్దరు బిడ్డల్ని ఘోరంగా చంపేసి పారిపోయిన తండ్రి ఉదంతం..

సాక్షి, ఖమ్మం: జిల్లాలో వేకువ ఝామునే ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనవరాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వృద్ధురాలి తనయుడు కనిపించకుండా పోవడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. పిట్టల పిచ్చమ్మ(60), ఆమె మనవరాళ్లు నీరజ(10), ఝాన్సీ(6)లు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు చిన్నారుల తండ్రి వెంకటేశ్వర్లే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రెండేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆమెను కూడా భర్తే వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని పోలీసులు వద్ద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement