ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్‌ చానెల్‌ అధికారి అరెస్ట్‌ | Delhi excise scam: CBI arrests news channel executive | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్‌ చానెల్‌ అధికారి అరెస్ట్‌

May 16 2023 5:06 AM | Updated on May 16 2023 5:06 AM

Delhi excise scam: CBI arrests news channel executive - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా మరొకరిని అరెస్ట్‌ చేసింది. ‘ఇండియా ఏహెడ్‌’ న్యూస్‌ చానెల్‌ కమర్షియల్‌ హెడ్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ అర్వింద్‌ కుమార్‌ జోషిని అదుపులోకి తీసుకుంది.

2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌ ప్రచార బాధ్యతలను చేపట్టిన చారియెట్‌ మీడియా సంస్థకు ఈయన హవాలా మార్గంలో రూ.17 కోట్లను బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వాట్సాప్‌ చాటింగ్, హవాలా ఆపరేటర్ల రికార్డులు పరిశీలించిన తర్వాత జోషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. చారియెట్‌ మీడియా యజమాని రాజేశ్‌ జోషిని ఫిబ్రవరిలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే, సరైన ఆధారాలను సమర్పించలేదంటూ మే 6న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement