ఇతని పేరు తిలక్. సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం టౌన్కు చెందిన వ్యక్తి. పుత్తూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ ఈసీఈ చదివాడు. గత ఏడాది బి.టెక్ పూర్తయింది. ప్రభుత్వం చెల్లిస్తామన్న ఫీజు రియింబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం అందించలేదు. 2022–23 సంవత్సరానికి గత ప్రభుత్వంలో ఓ విడత రియింబర్స్మెంట్ నగదు అందుకున్నాడు. తదుపరి ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ రియంబర్స్మెంట్ నగదు కూడా ప్రస్తుత సీఎం చెల్లిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా జమ కాలేదు. అతడి తల్లిదండ్రులు అప్పు చేసి కళాశాలకు ఫీజులు చెల్లించారు.


