
మామిడి రైతుకు కూటమి శఠగోపం
కార్వేటినగరం: మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టేసిందని, మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం ఉడమలకృత్తి గ్రా మంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఉ మ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులకు ఎక్కడా సంతోషం లేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పరిశ్రమలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. గత జగనన్న ప్రభుత్వంలో కిలో మామిడి రూ.30 వరకు చెల్లించినట్టు ఆయన గు ర్తుచేశారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం కిలో రూ.4కు పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. పరిశ్రమలు ఇచ్చే టోకన్లలోనూ రాజకీయాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని రైతులు ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేసి వేధించడం పనిగా పెట్టుకున్నట్టు విమర్శించారు. మామిడి రైతుల నుంచి దళారులు అతి తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వెంటనే మామిడి రైతు కన్నీళ్లు తుడాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇలాక కుప్పం నియోజకవర్గంలో భర్త చేసిన అప్పు చెల్లించలేదని భార్య శిరీషను చెట్టుకు కట్టి దాడి చేసిన పచ్చనేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బాలికపై 14 మంది టీడీపీ కామాంధులు అత్యాచారానికి ఒడిగడితే వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు.