
చిరు దుకాణంలో అగ్నిప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న చిరుదుకాణంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తినుబండారాలు తయారు చేసే ఆ చిరుదుకాణంలో గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బేకరిలోని వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.10 వేల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.