తోతాపురి మూడు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసింది. ఆయా రాష్ట్రాల నుంచి మామిడి దిగుమతి కాకుండా చేస్తోంది.
ధరలు వి‘ఫలం’!
జిల్లాలో మామిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ర్యాంపుల్లో కిలో రూ.3 లెక్కన పలుకుతోంది.
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025
● మాది చిత్తూరు రూరల్ మండలం, అనంతాపురం గ్రామం. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను 16 కి.మీ దూరంలో ఉన్న బీఎన్ఆర్.పేట గ్రామంలోని పాఠశాలలో విలీనం చేశారు. బీఎన్ఆర్ పేటకు వెళ్లాలంటే నాలుగు చెరువులు దారిలో ఉన్నాయి. చిత్తూరు–తిరుత్తణి హైవే ఉంది. ఇలాంటి ప్రమాదపు దారుల్లో పిల్లల్ని ఎలా పంపాలి.
● గంగాధరనెల్లూరు మండలం, నెల్లేపల్లి పంచాయతీ, కొత్తూరు గ్రామంలో ఉన్న పాఠశాలను కూట మి ప్రభుత్వం సమీపంలో ని నెల్లేపల్లి మోడల్ ప్రాథమిక పాఠశాలలోకి విలీ నం చేసింది. చాలా దూరంలో ఉన్న ఈ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలంటే కష్టంగా ఉంది. కూటమి వింత నిర్ణయం వల్ల పిల్లల కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి.
● మాది గంగాధరనెల్లూరు మండలం, అగ్రహారం గ్రామం. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల పిల్లలను కే.వీ.పురం పాఠశాలలో విలీనం చేశారు. దీని వల్ల 40 మంది విద్యార్థులు దూర ప్రాంతంలో ఉన్న కేవీ పురానికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలను మార్చకూడదని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో మూడు సార్లు నిర్ణయం తీసుకుని ఎంఈవోకు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
● మాది వెదురుకుప్పం మండలం, యనమల మంద గ్రామం. మా గ్రామంలో దాదాపు 520 కుటుంబాలు ఉన్నాయి. 50 మంది పిల్లలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పుడు పాఠశాలను దూర ప్రాంతంలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేశారు. విలీనం వల్ల మా పిల్లలు నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి వస్తోంది. ఇది న్యాయమేనా?.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్రీల్
రాష్ట్రాల మధ్య వివాదాల పురి
రాష్ట్రాల మధ్య వివాదాల పురి
రాష్ట్రాల మధ్య వివాదాల పురి