
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు పోటెత్తారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనాలతో ఆలయమంతా భక్త జన సందడి కనిపించింది. క్యూలైన్లు నిండి ఆలయ ఆవరణలో భక్తులు బారులుతీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయ ఆవరణలో స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షించారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ చర్యలు చేపట్టారు.