
ఆధునిక నేర పోకడపై అవగాహన తప్పనిసరి
చిత్తూరు అర్బన్: ఆధునిక సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు, ప్రజలు ఎలా మోసాలకు గురవుతున్నారనే విషయాలపై అవగాహన తప్పనిస రని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ సాంకేతిక నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ర కాల నేరాలకు పాల్పడుతూ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నా రు. సైబర్క్రైమ్పై నిర్లక్ష్యం చేయకుండా ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధితులు స్టేషన్కు వస్తే వెంటనే స్పందించాలన్నారు. పెండింగ్ కేసుల ద ర్యాప్తు సకాలంలో పూర్తి చేయాలని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. ఇక నేరస్తుల కదలికలను గుర్తించడానికి రూపొందించిన సీసీటీఎన్ఎస్ యాప్ను ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలన్నారు. డ్రోన్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలన్నారు. మూడు రోజులు పాటు డ్రోన్ శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన సిబ్బందికి మెలకువలు నేర్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, ప్రజా సమస్యల ఫిర్యా దు వేదికకు వచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
ఉద్యోగమేళా రేపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఉపాధి కా ర్యాలయంలో ఈ నెల 28వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జి ల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఉద్యోగమేళాలో పలు జాతీయ కంపెనీలు పాల్గొంటాయ న్నారు. జిల్లాలో డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియ ట్, డిగ్రీ పూర్తీ చేసి 19–35 సంవత్సరాల వ యస్సులోపు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల 28వ తే దీన విద్యార్హత సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని కోరారు.