నూతన సంస్కరణలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

నూతన సంస్కరణలపై అవగాహన తప్పనిసరి

Apr 27 2025 1:02 AM | Updated on Apr 27 2025 1:02 AM

నూతన సంస్కరణలపై  అవగాహన తప్పనిసరి

నూతన సంస్కరణలపై అవగాహన తప్పనిసరి

చిత్తూరు అర్బన్‌: న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యా యస్థానాలు ఇచ్చే తీర్పు లు, నూతన సంస్కరణలపై న్యాయమూర్తులు తప్పనిసరిగా అవగాహ న కలిగి ఉండాలని ఉ మ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు ‘లా ఆఫ్‌ రెపుటేషన్‌’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు సీనియర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. రిటైర్డు జిల్లా జడ్జిలు కెపి.బాలజీ, ఎస్‌.జగన్నాథం రీసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించి పలు విషయాలపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించారు. న్యాయమూర్తులు రమేష్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

12 మందికి

ఎంపీడీఓలుగా పదోన్నతులు

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లాలో 12 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీడీనెల్లూరు, రామకుప్పం, వెదురుకుప్పం, పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో డిప్యూ టీ ఎంపీడీఓలుగా ఉన్న హరిప్రసాద్‌రెడ్డి, రాధాకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్‌బాబును చిత్తూరు జి ల్లాకు కేటాయించారు. అలాగే కడప, అనకాపల్లె లో పనిచేస్తున్న హరిప్రసాద్‌రెడ్డి, శిరీషను చిత్తూ రు జిల్లాకు ఇచ్చారు. ఎర్రవారిపాళెం, నాగలాపురంలో విధులు నిర్వహిస్తున్న మాలతి, వెంకటరమణను తిరుపతి జిల్లాకు కేటాయించారు. నగరి, గంగవరం, బైరెడ్డిపల్లె ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏఓలుగా పనిచేస్తున్న సతీష్‌, భాస్కర్‌, మహేష్‌ కు ఉద్యోగోన్నతి కల్పించి, చిత్తూరు జిల్లాకు కేటాయించగా, రామసముద్రం ఏఓ గౌస్‌బాషాను కడప జిల్లాకు ఇచ్చారు. వీరికి త్వరలో మండలాలను కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement