ప్రారంభంలో నష్టాలు.. చివర్లో లాభాలు...

Share Market Daily Update - Sakshi

ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారం ఆరంభంలో వరుసగా రెండు రోజుల పాటు నష్టాలు చవి చూసిన సేర్‌ మార్కెట్‌, బక్రీద్‌ సెలవు దినం తర్వాత పుంజుకుంది,. దీంతో చివరి రెండు రోజుల్లో  లాభాల బాట పట్టింది. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52,967 పాయింట్లతో ప్రారంభమై వెంటనే పాయింట్లు పెంచుకుంటూ పోయింది. ఒక దశలో గరిష్టంగా 53,114 పాయింట్లకు చేరుకుంది. 53 వేల పాయింట్లకు పైనే మార్కెట్‌ ముగుస్తుందని అంచనా వేసినప్పటికీ చివర్లో అమ్మకాలు జోరుగా సాగడంతో చివరకు 52,975 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా 138 పాయింట్లు లాభపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,824 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు 15,856 పాయింట్లతో ప్రారంభమైంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 15,854 పాయింట్ల వద్ద క్లోయ్యింది. మొత​ంగా 30 పాయింట్లు పెరిగింది.

ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, యాక్సిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జోమాటో, తైన్‌వాలా, అపోలో పైప్స్‌, ఏషియన్‌ హోటల్స్‌, జోసిల్‌ షేర్లు లాభపడగా ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా హిందూస్థాన్‌ యూనిలీవర్‌,  త్రేఝారా సోల్యుషన్స్‌, వోడాఫోన్‌ ఐడియా, మాధవ్‌ కాపర్‌, సంభవ్‌ ఇన్‌ఫ్రా, ఇన్ఫీబీమ్‌ అవెన్యూ షేర్‌ హోల్డర్లు నష్టపోయారు. ఐపీవోలో భారీ స్థాయిలో సక్సెస్‌ అయిన జోమాటో షేర్లు తొలి రోజు రూ. 126 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. మొత్తంగా మొదటి రోజే షేర్‌ వ్యాల్యూ  66 శాతం ఎక్కువగా  పలికింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top