Amrit Kalash : ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!

Sbi Reintroduces 400 Days Amrit Kalash Retail Term Deposit Scheme - Sakshi

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. స్పెషల్‌ డిపాజిట్‌ పథకమైన అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. 400 రోజుల గడువు కలిగిన ఈ ప్లాన్‌ వాస్తవానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్‌ గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను జూన్‌ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్‌బీఐ తెలిపింది.  

ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్‌బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top