భారీ ఇంజిన్‌తో ఖరీదైన బైక్ | The new Triumph motorcycle has a truly monstrous engine | Sakshi
Sakshi News home page

భారీ ఇంజిన్‌తో ఖరీదైన బైక్

Sep 10 2020 3:56 PM | Updated on Sep 10 2020 4:08 PM

The new Triumph motorcycle has a truly monstrous engine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  యూకేకు చెందిన మోటార్‌సైకిల్‌ తయారీ దిగ్గజం ట్రయంఫ్ రాకెట్ 3 బ్రాండ్  లో అత్యంత ఖరీదైన కొత్త మెటార్ బైక్ లాంచ్ చేసింది.  భారీ ఇంజిన్‌తో  రాకెట్ 3 జీటీ  పేరుతో దీన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర  రూ .18.4 లక్షలుగా నిర్ణయించింది.  కరోనా  సంక్షోభం కాలంలో అమ్మకాలు లేక  దేశం నుంచి వైదొలగాలని మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భావిస్తున్న  తరుణంలో  ట్రయంఫ్ అద్భుత ఫీచర్లతో ఈ కొత్త మోటార్  సైకిల్  తీసుకువడం విశేషం. 


రాకెట్ 3 జీటీ స్పెసిఫికేషన్లు

  • ట్రిపుల్ మెటారు ప్రధాన ఆకర్షణ. అతిపెద్ద 2,500 సీసీ ఇన్ లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్  6000 ఆర్ పీఎమ్ వద్ద 167 బిహెచ్‌పి శక్తిని,  4,000 ఆర్పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గత వెర్షన్ కంటే  11 శాతం ఎక్కువ. 
  • కొత్త క్రాంక్కేస్ అసెంబ్లీ, ఇంటిగ్రల్ ఆయిల్ ట్యాంక్‌, బ్యాలెన్సర్ షాఫ్ట్ కలిగి ఉంది. ఇంజిన్ బరువును 18 కిలోలకు పరిమితం చేసింది. పాత తరం బైక్‌తో పోలిస్తే బరువును సుమారు 40 కిలోలు తగ్గించింది.
  • టూరింగ్ స్టయిల్ హ్యాండిల్‌బార్‌, పొడవైన విండ్‌స్క్రీన్,  గో ప్రో కంట్రెల్స్ తో బ్లూటూత్-ఎనేబుల్డ్ ఫుల్-కలర్ టిఎఫ్‌టి డాష్, హిల్-హోల్డ్ కంట్రోల్, 4 రైడ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి.  ఇంకా టార్క్ అసిస్టెడ్ క్లచ్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్,  ఎక్స్‌టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్, తేలికపాటి 20-స్పోక్ అల్యూమినియం వీల్ లాంటి ఇతర ఫీచర్లు ఈ బైక్ సొంతం. 


తమ కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ ఔత్సాహికుల బైక్ అని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షుయెబ్ ఫారూక్ తెలిపారు. అత్యుత్తమ టెక్నాలజీ, ఎర్గోనామిక్స్, ఆశ్చర్యపరిచే పనితీరుతో ఇదొక లెజెండ్ బైక్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement