Nasscom appoints Anant Maheshwari as Chairperson for FY24 - Sakshi
Sakshi News home page

నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా అనంత్‌ మహేశ్వరి

Apr 26 2023 7:28 AM | Updated on Apr 26 2023 10:27 AM

Nasscom Appoints Anant Maheshwari As Chairperson - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా 2023–24 సంవత్సరానికి అనంత్‌ మహేశ్వరి ఎంపికయ్యారు. మహేశ్వరి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గానూ ఇప్పటి వరకు సేవలు అందించారు.

టీసీఎస్‌ బిజినెస్, టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్‌ అయిన కృష్ణన్‌ రామానుజం ఇప్పటి వరకు నాస్కామ్‌ చైర్‌ పర్సన్‌గా సేవలు అందించగా, ఆయన స్థానంలో అనంత్‌ మహేశ్వరి పని చేయనున్నారు. కాగ్నిజంట్‌ ఇండియా చైర్మన్, ఎండీగా ఉన్న రాజేష్‌ నంబియార్‌ను నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించారు.  

Advertisement
 
Advertisement
Advertisement