ఉన్నత చదువులు చదువుకుంటూనే సొంత కాళ్లపై నిలబడాలనే నిశ్చయంతో ముందుకు సాగుతున్న నేటి యువతకు బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ విద్యార్థి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కళాశాల సెలవుల సమయాన్ని వృథా చేయకుండా బైక్ టాక్సీ అగ్రిగేటర్ సంస్థ రాపిడోలో క్యాప్టెన్గా చేరి రోజుకు సగటున రూ.1,200 వరకు ఆర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి ఇటీవల తెలిపాడు.
తన మూడు నెలల పని అనుభవాన్ని పంచుకుంటూ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (సుమారు 8.5 గంటలు) రాపిడో క్యాప్టెన్గా సేవలు అందించినట్లు పేర్కొన్నాడు. నిలకడైన ప్రణాళిక, కష్టపడే తత్వంతో పని చేస్తే సెలవుల్లోనే కాకుండా చదువుతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించాడు. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఉద్యోగ సాధన, గిగ్ ఎకానమీ కల్పిస్తున్న అవకాశాలపై నేటి తరం ఆలోచనా విధానానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
సమయ పాలన, ఆర్థిక స్వాలంబన పట్ల ఈ విద్యార్థి చూపిన చొరవ సోషల్ మీడియాలోనూ, ఇతర యువతలోనూ విశేష ఆదరణ పొందుతోంది. కేవలం చదువుకే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగిస్తూ గిగ్ వర్కర్గా మారడం ద్వారా ఒకవైపు పాకెట్ మనీ సంపాదిస్తాన్నాడు. మరోవైపు సమాజంలో రవాణా సేవలు అందించడంలో భాగస్వామి కావడం గమనార్హం.
ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం!


