Gold Price Today: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు! | Gold Price Today Jumps Over RS 48400 | Sakshi
Sakshi News home page

Gold Price Today: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!

Dec 16 2021 9:02 PM | Updated on Dec 16 2021 9:06 PM

Gold Price Today Jumps Over RS 48400 - Sakshi

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. న్యూఢిల్లీ బులియన్ ఇండియన్ జ్యూవెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.48,414గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర సుమారు రూ.439 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.44,347గా ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా అదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.47,350కు చేరుకుంది. విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.700కి పైగా పెరిగి రూ.61,074కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

(చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement