దశాబ్దాల తర్వాత ...
1980 నుంచి ఎనిమిది ఏళ్ల పాటు ఇక్కడ ఇంగ్లిష్, సోషల్ బోధించా. దశాబ్దాల కాలం తర్వాత వజ్రోత్సవాల వేళ రావడం ఆనందంగా ఉంది. నేను పాఠాలు చెప్పిన వారు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉండడం సంతోషంగా అనిపించింది.
–ఎం.వసంతరావు, ఉపాధ్యాయుడు
వేంసూరు పాఠశాలలో 1974 నుంచి 84 వరకు పీఈటీగా పని చేశా. ఇంత కాలం తరువాత మళ్లీ ఇక్కడకు రావడం.. నాటి విద్యార్థులతో గడపడం సంతోషాన్నిచ్చింది. అప్పుడు క్రీడల్లో గెలుపొందిన వారు అనుభవాలను వివరించారు. –ఎం.బాలకృష్ణారెడ్డి, పీఈటీ
పాఠశాలలో స్నేహితులైన వారిని ఎన్నటికీ మరిచిపోలేం. ఏస్థాయికి చేరినా బాల్యస్నేహం ఎప్పటికీ మదిలో సజీవంగా నిలిచే ఉంటుంది. అందుకే ఉత్సవాలకు మా స్నేహితులం అందరం హాజరై రోజంతా సంతోషంగా గడిపాం.
– వెల్ది జగన్మోహన్రావు, పూర్వ విద్యార్థి
దశాబ్దాల తర్వాత ...
దశాబ్దాల తర్వాత ...


