
ఈసారి 71 లక్షల మొక్కలు..
● వనమహోత్సవానికి సిద్ధమవుతున్న అధికారులు ● మొక్కలు నాటేందుకు ప్రభత్వ శాఖల వారీగా లక్ష్యాలు ● రైతులకు ప్రత్యేకంగా టేకు మొక్కల పంపిణీ
చుంచుపల్లి: జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించగా, మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వుతున్నారు. జూలై 1 నుంచి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నారు. గడిచిన ఆరు నెలలుగా గ్రామాల్లోని హరిత సర్సరీల్లో వన మహోత్సవానికి కావాల్సిన మొక్కలు పెంచుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నర్సరీలను నిర్వహిస్తుండగా, అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 481 హరిత నర్సరీలు, అటవీ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో మరో 32 నర్సరీల్లో వచ్చే వన మహోత్సవంలో మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉంచారు. పెద్ద గ్రామపంచాయతీల్లో 20 వేలు, చిన్న గ్రామ పంచాయతీల్లో 10 వేల చొప్పున 20 రకాల జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. కానుగ, వేప, చింత, నేరేడు, గుల్ మొహర్, జామ, వెలగ, శిశు, మునగ, సీమ తంగేడు, తులసి, గులాబీ, మందార, గన్నేరు, దిరిశన, అల్ల నేరేడు, ఉసిరి, దానిమ్మ, ఈత, బొప్పాయి, మందార, సిసో, టికోమ, బహునియా, సెలోఫాం తదితర రకాల మొక్కల పెంపకం చేపట్టారు. ఈ మొక్కలను గ్రామాల్లో అంతర్గత, అనుసంధాన రోడ్లకు ఇరువైపులా, చెరువు, కాలువ కట్టలు, ప్రభుత్వ, రౖపైవెట్ ఖాళీ స్థలాల్లో నాటనున్నారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పూలు, పండ్లు, వేప తదితర మొక్కలను పంపిణీ చేయనున్నారు.
నర్సరీల్లో సిద్ధంగా..
డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 481 హరిత నర్సరీల్లో దాదాపు 50 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో మరో 40 లక్షల వరకు మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో గత పదేళ్లుగా మొక్కలు నాటుతుండగా, ఈసారి 11 ఏట 71.41 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేకంగా పంపిణీ చేసేందుకు 20 లక్షల టేకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అడిగిన ప్రతి సన్నకారు, చిన్నకారు రైతుకు ఎకరానికి 100 వరకు టేకు మొక్కలను ఇవ్వనున్నారు. మొదటి విడతలో 111.49 లక్షలు, రెండో విడత 161.33 లక్షలు, మూడో 163.09 లక్షలు, నాల్గవ విడత 96.17 లక్షలు, ఐదో 146.27 లక్షలు, ఆరవ 160.29 లక్షలు, ఏడవ 135.41 లక్షలు, ఎనిమిదవ 105.08 లక్షలు, తొమ్మిదో 55.13 లక్షలు, పదో విడతలో 70.61 లక్షల చొప్పున మొక్కలను నాటారు.
లక్ష్యాలు కేటాయించాం
త్వరలో చేపట్టబోయే వన మహోత్సవానికి కావాల్సిన మొక్కలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం గ్రామ పంచాయతీలు, అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను ఇప్పటికే కేటాయించాం. అన్ని శాఖల సహకారంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేస్తాం. –ఎం.విద్యాచందన, డీఆర్డీఏ
ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటనున్న శాఖలు
ప్రభుత్వ శాఖ లక్ష్యం
డీఆర్డీఏ 30,00,000
ఫారెస్ట్ శాఖ 10,00,000
టీఎస్ఎఫ్డీసీ 12,90,000
సింగరేణి 3,30,000
ఎకై ్సజ్శాఖ 1,00,000
అగ్రికల్చర్ 5,00,000
ఇరిగేషన్ 2,00,000

ఈసారి 71 లక్షల మొక్కలు..