సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ

Jun 19 2025 4:40 AM | Updated on Jun 19 2025 4:40 AM

సీఎంన

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ

ఇల్లెందు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, మహబూబాబాద్‌ ఎంపీ బలరామ్‌నాయక్‌ బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. ఇల్లెందు, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, మాలోతు రాందాస్‌నాయక్‌ సీఎంను కలవగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధుల మంజూరు ప్రతిపాదనలు సమర్పించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా దృష్టి సారించాలని సీఎం వారికి సూచించారు.

భూ భారతితో సమస్యల పరిష్కారం

అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

చుంచుపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరమవుతుందని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ అన్నారు. మండలంలోని వెంకటేశ్వరకాలనీలో బుధవా రం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు లోకి తెచ్చిందన్నారు. తహసీల్దార్‌ కృష్ణ, ఆర్‌ఐ మంగ్యా, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

యువకుడి ఆత్మహత్య

ములకలపల్లి: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బుధవారం కేసు నమోదైంది. ఎస్సై కిన్నెర రాజశేఖర్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారాంనగరానికి చెందిన వేటగాని నాగరాజు (21)కు ములకలపల్లి మండలంలోని నల్లివారిగూడెం గ్రామానికి చెందిన గీతతో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసకాగా, గీత పుట్టింటికి వచ్చేసింది. కాగా నాగరాజు బంధువు మృతిచెందగా, భార్య గీతను తీసుకెళ్లేందుకు మంగళవారం నల్లివారిగూడెం వచ్చాడు. మద్యం మానేస్తేనే వస్తానని భార్య గీత స్పష్టం చేయడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జీసీసీ గోదాంలో

రేషన్‌ బియ్యం తనిఖీ

పాల్వంచరూరల్‌: స్థానిక గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సముదాయంలోని గోదాంలో రేషన్‌ బియ్యం నిల్వలను రాష్ట్ర విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అంజయ్య నేతృత్వంలోని బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. గోదాంలోని సన్నబియ్యం రేషన్‌ షాపులకు ఎన్ని క్వింటాళ్లు తరలించారు.. ఎంత నిల్వ ఉన్నాయి.. అనే వివరాలతో పాటు ఆర్‌ఓ ఎంట్రీలను పరిశీలించారు. దమ్మపేట, భద్రాచలంలో కూడా విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు డీటీ శ్రీనివాసరావు తెలిపారు.

గెలిచిన వారిపై

ఓడిపోయిన వారి దాడి

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ప్రైవేట్‌ అంబులెన్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఇటీవల జరగగా.. ఓడిన వారు ఆగ్రహంతో గెలిచిన వర్గీయులపై దాడి చేశా రు. ఈ ఘటనలో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతున్నాడు. పలు ప్రైవే ట్‌ ఆస్పత్రులకు సంబంధించిన అంబులెన్స్‌ డ్రైవర్ల యూనియన్‌ ఎన్ని కలు ఇటీవల జరిగాయి. ఇప్పటికే ఉన్న కార్యవర్గ బాధ్యులు ఓడిపోగా, కొత్తవారు గెలిచారు. లావాదేవీలపై చర్చించేందుకు నూతన కార్యవర్గం బాధ్యులు మంగళవారం ఖమ్మం నెహ్రూనగర్‌లో పాత యూనియన్‌ బాధ్యుల వద్దకు వెళ్లగా ఆగ్రహంతో ఉన్న వారు లెక్కలు వివరించే క్రమాన గొడవకు దిగారు. ఆపై అంబులెన్స్‌ డ్రైవర్‌ వినయ్‌ ఆధ్వర్యాన ఏలూరి శ్రీకాంత్‌, మైదులు, మహేశ్‌ తదితరులపై దాడి చేయగా శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యు లు నిర్ధారించడంతో న్యాయమూర్తి శ్రీకాంత్‌ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, దాడికి పాల్పడిన వినయ్‌ తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టు టౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు.

సీఎంను కలిసిన  ఎమ్మెల్యేలు, ఎంపీ1
1/2

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ

సీఎంను కలిసిన  ఎమ్మెల్యేలు, ఎంపీ2
2/2

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement