
రూ.3.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్ రోడ్డు సమీపాన గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకర రమేశ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టగా టీన్జీవోస్ కాలనీకి చెందిన కట్టగోరు రవితేజ, పాకబండబజార్కు చెందిన జిలాన్ సైఫ్, సంభానీనగర్కు చెందిన షేక్ మహమ్మద్ బాషా, పిండిప్రోలుకు చెందిన బాసిగోంపు గోపి, కోలా శ్రీకాంత్ పట్టుబడ్డారు. ఇదే ముఠాకు సంబంధించి ఎలగందుల సందీప్ పరారీలో ఉండగా, వీరంతా ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరికి బైక్లపై వెళ్లి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితుల నుంచి రూ.3.60 లక్షల విలువైన గంజాయితో పాటు నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సీఐ రమేశ్తోపాటు ఎస్ఐ శ్రీహరిరావు, ఉద్యోగులు కరీం, బాలు, సుధీర్, వెంకటేశ్, విజయ్, హనుమంతరావు, హరీశ్, వీరబాబు పాల్గొన్నారు.