దుమ్ముగూడెం: ములకపాడు వైద్యశాల సమీపంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలోని ట్రాక్పై ఉన్న మొక్కలను బుధవారం పోలీసులు తొలగించారు. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంతో ఇండోర్ స్టేడియంతో ప్రారంభించడంలేదని, దీంతో మైదానంలోని ట్రాక్పై మొక్కలు మొలిచాయని ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన సీఐ అశోక్కుమార్ తన సిబ్బందితో కలిసి శ్రమదానం చేపట్టి ట్రాక్పై మొలిచిన మొక్కలను తొలగించారు. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయించి, త్వరలోనే ఇండోర్ స్టేడియం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ గణేష్, సిబ్బంది, స్థానిక యువకులు పాల్గొన్నారు.